ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

18-05-2021

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సిల్గర్ వద్ద‌ తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని పోలీసులు ప్రకటించినప్పటికీ 9 మంది మరణించారని, 16 మంది గాయపడ్డారని ఆదివాసీలను ఉటంకిస్తూ స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు. స్థానిక జర్నలిస్టులు పలు వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో పోలీసులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలున్నాయి. గాయాలపాలైన ఆదివాసులున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు చెప్పడాన్ని కూడా మనం ఆ వీడియోలో చూడొచ్చు.

గ్రామస్తుల ముసుగులో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేశారని, అందువల్ల పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని ఇందులో ముగ్గురు మృతి చెందారని బస్తర్ ఐజి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని ʹబస్తర్ టాకీస్ʹ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. దీన్ని స్థానిక జర్నలిస్టులు నడుపుతున్నారు.

ఈ ఘటనపై మరో సీనియర్ జర్నలిస్టు ʹఅశుతోష్ భరద్వాజ్ʹ వరస ట్వీట్లు చేశారు.

ʹʹబస్తర్ లో హింసాత్మక చరిత్ర ఈ రోజు ఒక కొత్త అధ్యాయాన్ని చవి చూసింది, బహుశా ఈ దశాబ్దంలో ఇది మొదటి ఉదాహరణ, సిల్గర్ వద్ద‌ నిరాయుధమైన ఆదివాసీలపై పోలీసులు కాల్పులు జరిపారు, ముగ్గురు మృతి చెందారు మరియు కనీసం 16 మంది గాయపడ్డారు. ఈ కాల్పులు రాత్రి పూట జరిగినవి కావు, పట్టపగలు జరిగాయి. ఇది నకిలీ ఎన్ కౌంటర్.

ʹʹనేను జనవరిలో ఈ ప్రదేశానికి వచ్చాను.ఇప్పుడు అడవిని నిర్మూలించారు, ఒక పెద్ద రహదారి మరియు పోలీసు శిబిరాలు నిర్మిస్తున్నారు. ఆదివాసీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు.ʹʹ

ʹʹఈ రోజు నిరసనలు తీవ్రమయ్యాయి - పోలీసులు బుల్లెట్లతో సమాధానమిచ్చారు.ʹʹ

ʹʹనేను బస్తర్లో కొన్ని ఎన్కౌంటర్లు మరియు ఆకస్మిక దాడులు మరియు హత్యలను చూశాను. కానీ ఈ రోజు జరిగింది మాత్రం ఖచ్చితంగా ఎన్నడూ చూడనటువంటిది. సాల్వా జుడమ్ తరువాత ఆదివాసులపై కాల్పులు జరిపిన సందర్భం ఇది తప్ప బహుశా మరోటి లేదు.ʹʹ
ʹʹఛత్తీస్గడ్ లోని టీవీ ఛానెళ్ళకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో, తొమ్మిది మంది మరణించారని ఒక ఆదివాసీ చెప్పారు.
పోలీసులు మాత్రం ముగ్గురే మరణించారని ప్రకటించారు. ఎందుకంటే వారు 3 మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆరు మృతదేహాలు గ్రామస్తులతో ఉన్నాయి.ʹʹ

ʹʹనక్సల్స్ వారిపై దాడి చేసిన తరువాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. అయితే ఈ వార్తలను స్థానికులు ఖండిస్తున్నారు.నక్సలైట్లు అసలు అక్కడ లేనే లేరని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైపు నుండి కాల్పులు జరిపినట్లు ఆధారాలు లేవు. మరియు పోలీసులెవరికీ చిన్న గాయం కూడా కాలేదు.ʹʹ

అసలేం జరిగింది. ?

సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో ఉన్న‌ సిల్గర్ వద్ద‌ తారెమ్‌లోని మోకూర్ సిఆర్‌పిఎఫ్ క్యాంప్ ను ఎత్తి వేయాలనే డిమాండ్ తో చత్తీస్ గడ్ లోని దాదాపు 25 గ్రామాలకు చెందిన దాదాపు 5 వేలకు పైగా ప్రజలు ఆ క్యాంపు బైట్ మూడురోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల బెదిరింపులతో ఆదివారం రాత్రి వెనక్కి వెళ్ళిపోయిన ఆదివాసీలు సోమవారం ఉదయాన్నే మరింత ఎక్కువమందితో క్యాంపు వద్దకు వచ్చి ధర్నా మొదలు పెట్టారు. అప్పుడు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని పోలీసులు , 9 మంది చనిపోయారని ఆదివాసులు చెప్పారు. 16 మందికి పైగా ఆదివాసులు తీవ్ర గాయాలపాలయ్యారు. అక్కడ గ్రామస్తులతో పాటు మావోయిస్టులు కూడా ఉన్నారని వారు తమపై కాల్పులు జరిపారని అందుకే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు ప్రకటించగా. అసలు అక్కడ మావోయిస్టులే లేరని పోలీసులే ఏకపక్షంగా హటాత్తుగా తమపై కాల్పులు జరిపారని స్థానికులు చెబుతున్నారు.

Keywords : chattis garh, police firing, adivasi, death, crpf
(2024-05-18 09:47:26)



No. of visitors : 2652

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹపోలీసు