ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

ప్రధానికి

23-06-2021

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

హిడ్మే మార్కమ్ తో సహా వందలాది మంది ఆదివాసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సమావేశమై భద్రతా దళాల లైంగిక వేధింపులకు గురై మరణించిన‌ ఇద్దరు ఆదివాసీ మహిళల గురించి మాట్లాడారు. భద్రతా దళాల లైంగిక వేధింపులకు గురై పదహారేళ్ళ బాలిక ఆత్మహత్య చేసున్న సంఘటన‌పై , బస్తర్ ప్రాంతంలో మహిళలపై భద్రతా దళాలు చేస్తున్న అరాచకాలపై ఆ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధమైన హత్యలు, లైంగిక వేధింపులు మరియు అరెస్టులకు వ్యతిరేకంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సభను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా హిడ్మే మార్కమ్ ను తీసుకెళ్ళారు.

ఈ విషయంపై ఏప్రిల్లో ఏడుగురు ఐరాస నిపుణులు ప్రధాని మోడీకి లేఖ రాశారు. అందులో... ʹʹమానవ హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు. శాంతియుత నిరసనలను ఉగ్రవాదంతో ముడి పెట్టి ఉగ్రవాద నిరోదక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.ʹʹ అని వారు పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై ప్రధాని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఐరాస బృందం ఆ లేఖను బహిరంగంగా విడుదల చేసింది.

ఆదివాసులపై తప్పుడు కేసులను ఎత్తివేస్తామని మార్కమ్‌ను అరెస్టు సందర్భంగా ఛత్తీస్డ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ హామీ ఇచ్చారు. ఈ నెలలో 726 మందిపై అభియోగాలు ఎత్తివేయబడ్డాయి. కానీ మార్కమ్ తో సహా వేలాది మంది ఇతర ఆదివాసీలు భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశించిన కఠినమైన చట్టాలకింద ఇంకా జైలులో మగ్గుతూనే ఉన్నారు. మరో వైపు ఆదివాసీలపై హింస కొనసాగుతూనే ఉంది. మే 17 న పోలీసులు ఆదివాసీలపై కాల్పులు జరిపి నలుగురిని పొట్టనబెట్టుకున్నారు.

" మన వనరులను దోచుకోవడాన్ని వ్యతిరేకించే ఎవ్వరినీ ప్రభుత్వాలు సహించబోవని హిడ్మే అరెస్టు, ఆ అరెస్టు చేసిన‌ విధానం రుజువు చేస్తున్నదిʹʹ అని ఆదివాసీ కవి జసింటా కెర్కెట్టా అన్నారు,

హిడ్మే మార్కమ్ అరెస్టు కావ‌డానికి కొంతకాలం ముందు ఆమె ఇలా అన్నారు, ʹ[పారామిలిటరీ] శిబిరాలు వచ్చిన తర్వాత‌ మా భూములలో అటవీ ఉత్పత్తులను సేకరించడానికి లేదా వ్యవసాయం చేయడానికి స్వేచ్ఛగా అడవులకు వెళ్ళలేము. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వారు పెద్ద కంపెనీలకు మద్దతు ఇస్తారు మా లాంటి సాధారణ ఆదివాసులను పట్టించుకోరు. ఈ భూములను ప్రభుత్వం కార్పొరేషన్లకు అప్పగించడాన్ని నిరసిస్తున్న గ్రామస్తులను జైలులో పెడుతున్నారు. మేము ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయాము, కాని మా భూములను, మన అడవులను కాపాడటానికి పోరాటం కొనసాగిస్తాము. ʹ

సీనియర్ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ ఆఫీసర్ సోఫీ గ్రిగ్ ఈ రోజు ఇలా అన్నారు: ʹ మానవ హక్కుల కోసం నిలబడటానికి, మీ భూమిని రక్షించుకోవడానికి, లేదా కేవలం ఆదివాసీ వ్యక్తిగా ఉండటానికి మోడీ పాలనలోని ఇండియా ఒక ప్రమాదకరమైన ప్రదేశం. తన పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా ఇదే సాగుతోంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అంతర్జాతీయ సమాజం ఐరాస నిపుణులతో చేతులు కలపాలి. హిడ్మే మార్కమ్ వంటి ఆదివాసుల పై హింస, వారి భూమినుండి వారిని తరిమేయడం వంటి చర్యలను వెంటనే ఆపాలని మనం డిమాండ్ చేయాలి.ʹʹ

నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఐరాస నిపుణుల బృందంలోని ఏడుగురు సభ్యుల వివరాలు

ఏడుగురు UN నిపుణులు:

Mary Lawlor - మానవ హక్కుల రక్షకుల పరిస్థితిపై ప్రత్యేక రిపోర్టర్

Elina Steinerte - ఏకపక్ష నిర్బంధంపై వర్కింగ్ గ్రూప్ వైస్ చైర్

Irene Khan - అభిప్రాయ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ యొక్క హక్కును ప్రోత్సహించడం మరియు రక్షించడంపై ప్రత్యేక రిపోర్టర్

Clement Nyaletsossi Voule - శాంతియుత సమావేశ స్వేచ్ఛ మరియు అసోసియేషన్ హక్కులపై ప్రత్యేక రిపోర్టర్

Fionnuala Ní Aoláin - ఉగ్రవాదాన్ని ఎదుర్కునేటప్పుడు మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛల ప్రోత్సాహం మరియు రక్షణపై ప్రత్యేక రిపోర్టర్

Dubravka Šimonovic - మహిళలపై హింస, దాని కారణాలు మరియు పర్యవసానాలపై ప్రత్యేక రిపోర్టర్

Elizabeth Broderick - మహిళలు మరియు బాలికలపై వివక్షపై వర్కింగ్ గ్రూప్ యొక్క చైర్-రిపోర్టర్

(survivalinternational.org సౌజన్యంతో)

Keywords : UNO, Chattis garh, hedme markam, UN experts slam Modiʹs government for incarceration of indigenous rights defender
(2024-05-16 06:16:48)



No. of visitors : 2861

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రధానికి