UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది

UAPAను


19-10-2021

అక్టోబర్ 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో, రాజకీయ కార్యకర్త టిప్పు సుల్తాన్‌ను శాంతినికేతన్‌లోని గురుపల్లిలో వున్న అతని ఇంటి నుండి పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు.

టిప్పు సుల్తాన్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు, వారు అతని తాతగారికి ఎలాంటి లిఖితపూర్వక నోటీసు ఇవ్వలేదు.

టిప్పు సుల్తాన్, @ ముస్తఫా కమల్, విశ్వభారతి పూర్వ విద్యార్ధి, వామపక్ష రాజకీయ కార్యకర్త,

టిప్పును గురువారం ఝార్‌గ్రామ్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు టిప్పుకు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

రాత్రి 11:30 గంటల సమయంలో, అతని తల్లిదండ్రులు ఇంట్లో లేరు, టిప్పు మాత్రమే తన తాతగారితో ఉన్నాడు. 6-7గురు పోలీసులు (వారిలో నలుగురు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు) వ్యాన్‌లో వచ్చి తమతో పాటు బలవంతంగా తీసుకెళ్లారు. విచారణ కోసం తీసుకెళ్తున్నట్లు పోలీసులు టిప్పు సుల్తాన్ తాతగారికి చెప్పారు. కానీ అరెస్ట్ వారెంట్ చూపించలేదు. మరుసటి రోజు ఉదయం, అతని అరెస్టు వివరాలు తెలుసుకోడానికి బోల్పూర్ పోలీస్ స్టేషన్ వెళ్లిన అతని కుటుంబ సభ్యులు, స్నేహితులకు అరెస్టు విషయం తమకు తెలియదని చెప్పి ఆ తరువాత, ఝార్‌గ్రామ్ జిల్లా పోలీసులు ఐదేళ్ల పాత కేసులో టిప్పును అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. టిప్పును 13/10/2021 న c/w బెల్పహరి PS కేసు నం. 11/2016 తేదీన 29.01.2016 తేదీన అరెస్టు చేసినట్లు, అక్టోబర్ 14 న జార్‌గ్రామ్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు అతని తండ్రికి లేఖ ద్వారా తెలియజేశారు.

అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (ఎపిడిఆర్), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పీపీ-పశ్చిమ బెంగాల్ ) వంటి మానవ హక్కుల సంస్థలు- డబ్ల్యుబి, ఫాసిస్ట్ వ్యతిరేక పౌరుల వేదికలు, విద్యార్థి సంస్థలు అతని అరెస్టును తీవ్రంగా ఖండించాయి. అతడిని వేధించాలనే,గొంతు నొక్కాలనే ఉద్దేశ్యంతోనే ఐదు సంవత్సరాల క్రిందటి UAPA కేసులో యిరికించారనీ, పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించాయి. ʹʹఅక్టోబర్ 12 రాత్రి, పోలీసులు వచ్చి అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లినప్పుడు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 50 ప్రకారం అతడికి కస్టడీ మెమో ఇవ్వలేదు, అతడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో, అరెస్టు చేశారా లేదా అనే విషయాన్ని చెప్పలేదు. మరుసటి రోజు ఆందోళన చెందిన అతని కుటుంబం, స్నేహితులకు అతని అరెస్టు సమాచారం పోలీసులు ఇవ్వలేదు. అరెస్టు చేసిన 24 గంటలలోపు టిప్పును కోర్టులో హాజరుపరచలేదు. 13/10/2021 న అతని అరెస్టు చేశామని పోలీసులు తప్పుగా చూపించారుʹʹ. అని ఎపిడిఆర్,సిఆర్‌పీపీ మండిపడింది. అతడిని వెంటనే విడుదల చేయాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

పరుల్‌డంగాలో ఇటీవల జరిగిన ఒక చిన్నారి హత్య, అత్యాచార సంఘటనకి సంబంధించి టిప్పు చేసిన ఉద్యమమే టిప్పును ఆకస్మికంగా 2016 కేసులో అరెస్టు చేయడానికి గల కారణమై ఉండవచ్చని అతని స్నేహితులు, ఇతర కార్యకర్తలు ఆరోపిస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాన్ని తెరపైకి తెచ్చింది. అత్యాచార, హత్య‌ నేరానికి పాల్పడిన వారిని శిక్షించాలని జరిగిన ప్రజా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారిలో టిప్పు సుల్తాన్ ఒకరు. టిప్పు వంటి కార్యకర్తల గొంతు నొక్కడం ద్వారా ఈ సంఘటనను కప్పిపుచ్చడానికి చేసిన ప్రతీకార చర్య అతని అరెస్ట్ అని వారు పేర్కొన్నారు. హత్రాస్ కేసులో కార్యకర్తలను, సిద్ధికి కప్పన్ వంటి పాత్రికేయులను కూడా అరెస్టు చేసిన యోగి ఆదిత్యనాథ్ పోలీసుల మాదిరిగానే ఈ పద్ధతి ఉంది.

ʹజనవరి 2016లో మేం కాలేజీకి వెళ్లే, వీధి మూలల్లో కబుర్లు చెప్పుకునే పిల్లలం. ఇక ఆయుధాలా? మా వద్ద ఉన్న ఏకైక ఆయుధాలు మా చైతన్యం, సమ సమాజం కోసం పనిచేయాలనే అత్యుత్సాహం.ʹ వారు ఎక్కువగా భయపడే ఆయుధాలు ఇవే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తుపాకులు, బాంబుల విషయానికొస్తే: అతని నుండి ఏదీ స్వాధీనం చేసుకోలేదు. అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత వారు అతడిని 5 సంవత్సరాల క్రితం నాటి కేసులో యిరికించారు. చేశారు! ఈ ఆరోపణలు విపరీతమైన హాస్యాస్పదంగా వున్నాయి.ʹʹ అని టిప్పు స్నేహితులలో ఒకరు అన్నారు.

2018నవంబర్‌లో, జంగల్‌మహల్ నుండి పశ్చిమ బెంగాల్ పోలీసులు టిప్పు సుల్తాన్‌ను మరో ముగ్గురితో పాటు అరెస్టు చేశారు. వారు మావోయిస్టు కార్యకర్తలని, వారి దగ్గర ʹమావోయిస్టు కరపత్రాలనుʹ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. ఈ నలుగురిపై సెక్షన్ 149 (చట్టవిరుద్ధమైన అసెంబ్లీ), 120 (నేరం చేయబోయే ఆలోచనను దాచడం), 121 (యుద్ధం చేయడం లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం), 122 (యుద్ధం చేసే ఉద్దేశ్యంతో ఆయుధాలు సేకరించడం), 124A (రాజద్రోహం) శిక్షా స్మృతి కింద కేసు నమోదు చేసారు. కానీ, పోలీసులు ఛార్జిషీట్‌ను కూడా కోర్టులో యివ్వలేకపోవడంతో టిప్పును 2019 లో విడుదల చేశారు. టిప్పుపై ఏదైనా పెండింగ్‌లో వున్న కేసు గురించి లేదా 2016 UAPA కేసు గురించి ఆ సమయంలో పోలీసులు కోర్టుకు తెలియజేయలేదు. టిప్పుకు బెయిల్ మంజూరు చేసినప్పుడు కూడా పోలీసులు 2016 కేసుకు రిమాండ్ లేదా కస్టడీని అడగలేదు. 2016 లో బెల్పహరి పోలీసులు మావోయిస్టు పార్టీ పేరు కలిగిన పోస్టర్‌, ఒక ఆయుధం కలిగి వున్నాడని జైరామ్ ముర్ము అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై UAPA కింద కేసు నమోదైంది. కానీ 2016 నుంచి 2021 వరకు ఆ సంఘటనపై ఎలాంటి విచారణ జరగలేదు. జైరామ్ ఏడాదిలోపే విడుదలయ్యాడు, ఇప్పుడు అతను ఉద్యోగం చేస్తున్నాడు. నిద్రాణమైన ఆ కేసులో టిప్పు పేరును చేర్చి ఇప్పుడు అరెస్టు చేశారు.

విచిత్రంగా, కొన్ని రోజుల క్రితం UAPA కి వ్యతిరేకంగా ఒక మెమోరాండంపై సంతకం చేసిన వారే, ప్రజా ఉద్యమ కార్యకర్తలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో UAPA ని తిరిగి ప్రవేశపెట్టారు. కఠినమైన UAPA కింద కేసు పెట్టి ఫాదర్ స్టాన్ స్వామి నిర్బంధంలో మరణించినప్పుడు 2021 జూలై 6న, మమతా బెనర్జీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు దు:ఖాగ్రహాలను వ్యక్తం చేస్తూ భారత రాష్ట్రపతికి పంపిన లేఖపై సంతకం చేశారు.

ʹభీమా కోరెగావ్ కేసులో జైలు నిర్బంధంలో వున్న వారందరినీ UAPA, దేశద్రోహ చట్టం మొదలైన కఠినమైన చట్టాలతో సహా యితర రాజకీయ ప్రేరేపిత కేసుల్లో నిర్బంధంలో వున్న వారందరినీ వెంటనే విడుదల చేయాలిʹ అని ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో రాసారు.

మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు, అదే కఠినమైన UAPA కింద ఒక ఐదేళ్ల కిందటి కేసులో పూర్వ విద్యార్థి కార్యకర్తను అరెస్టు చేసింది. టిప్పును అరెస్ట్ చేయడం, UAPAని వుపయోగించిన విధానం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఆమె రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు, అసమ్మతివాదులతో వ్యవహరించే విషయంలో బిజెపికి భిన్నంగా లేదని చూపిస్తుంది.

అసమ్మతి స్వరాన్ని అణిచివేయడానికి TMC ప్రభుత్వం టిప్పు వంటి ప్రజా ఉద్యమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుందని అనేక సామాజిక, రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని బిజెపి ప్రభుత్వం ఆరోపిస్తున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న టిఎంసి అధిష్టానం, తన రాష్ట్రంలో మాత్రం అదే పని చేస్తోంది. నిరంకుశ హిందూత్వ ఫాసిస్ట్ శక్తులను మనం నిర్ధాక్షిణ్యంగా వ్యతిరేకించినట్లే, నియంతృత్వ తృణమూల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయకపోతే ఈ రకమైన అరెస్టులు మరింత తరచుగా జరుగుతాయి. అయితే, రాజకీయ కపట ఆట ఆడడంలో మమత ఒంటరికాదు, CPIM పాలిత కేరళలో కూడా, అసమ్మతివాదులను నిశ్శబ్దం చేయడానికి UAPA, దేశద్రోహ చట్టాలు ఉపయోగిస్తోంది.

ఐదేళ్ల కిందటి పాత కేసులో టిప్పును అరెస్ట్ చేయడానికి గల కారణాల గురించి తెలుసుకోవడానికి APDR నుండి ఒక బృందం, ఝార్‌గ్రామ్ SP ని కలవడానికి వెళ్తే, ఎస్పీ కలవడానికి నిరాకరించారు. టిప్పు అరెస్టును నిరసిస్తూ, తమ కస్టడీలో ఉన్నప్పుడు టిప్పును ఎలాంటి శారీరక, మానసిక హింసకు గురిచేయవద్దని పోలీసు విభాగానికి ఎపిడిఆర్ సభ్యులు ఒక మెమోరాండం సమర్పించారు.

Keywords : west bengal, mamatha benarjee, tippu sultan, arrest, apdr, crpp, UAPA
(2024-05-21 00:00:13)



No. of visitors : 746

Suggested Posts


కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ

జాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు.

అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌

సిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం

కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి

అమరుడు కిషన్ జీ నాయకత్వంలో పీడితులు మహత్తర పోరాటాలు చేసిన పశ్చిమ బెంగాల్ జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ అగ్గి రాజుకుంటోంది. జంగల్ మహల్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ లు తీవ్రతరం చేశారు.

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.

విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణ‌

ప్రజా ఉద్యమ కార్యకర్త, విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి.

జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటన‌

జైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం.

భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర‌ ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్

ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని

కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త

Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం

సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మహిళా విభాగం ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఎయిర్‌వో) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షర్మిస్ట ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందుతూ ప్రగతిశీల మహిళా సంఘం

బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు

ప‌శ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామం బ‌రోమాసియాకు చెందిన సునీతా హ‌న్స్ధా ఇప్పుడు గుండె ప‌గిలి ఏడుస్తున్న‌ది. త‌ర‌త‌రాలుగా ఆ భూమిపై వ్య‌వ‌సాయం చేస్తూ ‌తుకున్న త‌మ‌ను భూమిని వ‌దిలి వెళ్లిపోవాల‌ని అంటున్నార‌ని క‌న్నీరు పెట్టుకుంటున్న‌ది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


UAPAను